Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్ - ప్రజా సమస్యలపై సూచన

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (14:24 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ బుల్లెట్ రైడ్ నిర్వహించారు. మొన్నటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఈయన ఇపుడు కృష్ణా జిల్పా ఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ఇలా బాధ్యతలు తీసుకుని 4 రోజులు గడవక ముందే, ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు. 
 
మచిలీపట్నంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 
ఆర్‌పేట ఠాణాను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వద్దే పరిష్కారం అయితే, ప్రభుత లక్ష్యం నెరవేరినట్టేనని కామెంట్ చేశారు. 
 
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని కోరారు. తమపై జరుగుతున్న దాడుల గురించి మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి చెప్పుకునేందుకు వీలుగా.. దిశ, స్పందన పోలీసు విభాగాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు.
 
సమస్యల పరిష్కారానికి మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాల్లో సంప్రదించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments