Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్డర్ చేసిన ఫుడ్‌కు డబ్బులు అడిగితే.. కస్టమర్లను పోలీస్ అలా వెళ్ళగొట్టాడు.. (వీడియో)

ఆర్డర్ చేసిన ఫుడ్‌కు డబ్బులు అడిగితే.. కస్టమర్లను పోలీస్ అలా వెళ్ళగొట్టాడు.. (వీడియో)
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:00 IST)
పోలీసులు డబ్బులిచ్చి ఫుడ్ తినడం అనేది అరుదు. కొందరు పోలీసులు ప్రజలను డబ్బులడుగుతూ ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా హోటల్‌లో ఫుడ్‌కు ఆర్డర్‌ చేసిన ఒక పోలీస్‌ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు ఓ పోలీస్. దీంతో ఆ హోటల్‌ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఒక హోటల్‌కు వచ్చిన ఎస్‌ఐ ఫుడ్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు హోటల్‌లో ఉన్న కస్టమర్లపై లాఠీతో కొట్టి బయటకు వెళ్లగొట్టాడు. ఈ క్రమంలో ఒక మహిళకు లాఠీ దెబ్బ తగలడంతో ఆమె ఏడ్చింది.
 
ఇదంతా హోటల్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా ఆ ఎస్‌ఐపై హోటల్‌ యజమాని సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు లంచాల కోసం తమను వేధించడంతోపాటు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం