Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లా పాఠశాలలో కరోనా కలకలం.. ఐదుగురు విద్యార్థులకు కోవిడ్

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:27 IST)
కృష్ణాజిల్లా పాఠశాలలో కరోనా కలకలం రేపింది. కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, సైన్స్ అసిస్టెంట్‌‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. బాధిత విద్యార్ధులందరూ మండల కేంద్రమైన ముసునూరుకు చెందినవారు. 
 
కరోనా బాధితులకు ప్రభుత్వ వైద్యులు చికిత్సనందిస్తున్నారు. మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో  పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇక స్కూల్ మొత్తం శానిటైజ్ చేసి.. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. 
 
అంతేకాదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులను స్కూలుకు పంపేందుకు సంకోచిస్తున్నారు.
 
పలు పాఠశాలల్లో కరోనా సోకడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకేరోజు ఐదుగురికి మించి విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ స్కూల్‌ను మూసేయాలని స్పష్టం చేసింది. మిగిలిన విద్యార్థులకు 14 రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత మాత్రమే క్లాసులు నిర్వహించాలని సూచించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments