Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఓటు వేసిన కోరుకల్లు సర్పంచ్.. పండంటి ఆడబిడ్డకు?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ పోలింగ్ రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేశారు. 9 నెలల గర్భిణి అయిన ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం తన ఓటు హక్కును ఆమె వినియోగించుకున్నారు. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు వచ్చాయి. 
 
దీంతో, ఆమెను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ రోజున బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. కోరుకల్లు సర్పంచ్ స్థానాన్ని మహిళలకు కేటాయించారు.
 
ఏపీలో ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వివరాలు తెలిపారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments