Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఓటు వేసిన కోరుకల్లు సర్పంచ్.. పండంటి ఆడబిడ్డకు?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ పోలింగ్ రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేశారు. 9 నెలల గర్భిణి అయిన ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం తన ఓటు హక్కును ఆమె వినియోగించుకున్నారు. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు వచ్చాయి. 
 
దీంతో, ఆమెను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ రోజున బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. కోరుకల్లు సర్పంచ్ స్థానాన్ని మహిళలకు కేటాయించారు.
 
ఏపీలో ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వివరాలు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments