Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి పీర్ల పంజాను దర్శించిన బిజెపి నాయ‌కులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:57 IST)
మొహరం పండగ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖిల్లా రోడ్ లో ఏర్పాటు చేసిన పీర్ల పంజాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సందర్శించారు.

ఆయనతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు బబ్బురి శ్రీ రామ్, బిజెపి మైలవరం ఇంచార్జ్ నూతలపాటి బాల, బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, మౌలాలి, నాగుల్ మీరా, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు. బిజెపి విజయవాడ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా కార్యదర్శి సుభాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా అతిథులను సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు.

అనంతరం పీర్ల పంజా వద్ద దేశం సౌభాగ్యంగా ఉండాలని ప్రజలందరూ కరోనా కష్టాలు తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ. సత్యం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని మహమ్మద్ ప్రవక్త మనవలు చూపిన మార్గంలో ముస్లింలందరూ నడవాలని, అల్లా దయతో భారత దేశం మొత్తం సుభిక్షంతో వర్ధిల్లాలని కోరుకున్న మని, కొండపల్లి పంజా ను సందర్శించడం ఆనందకరం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments