Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకం.. కోడెలపై దాడి..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.


ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు మరణించారు.
 
ఏపీలో పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ మండిపడింది. ఈ విషయాన్ని సీఈవో ద్వివేది దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ ఆరోపించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల జాబితాను ద్వివేదికి అందజేశారు. దాడులకు తెగబడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments