Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికున్నపుడు వేధించి.. ఇపుడు లాంఛనాలు ఎందుకు? కోడెల ఫ్యామిలీ ప్రశ్న

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:31 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. 
 
అయితే, కోడెల కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలు తమకేమి వద్దని తేల్చి చెప్పారు. బతికున్న సమయంలో వేధించి, ఇప్పుడు లాంఛనాలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, కోడెల అంత్యక్రియలు ఆయన అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే బుధవారం మధ్యాహ్నం జరుగనున్నాయి. ఇందుకోసం టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. అదేసమయంలో తమ అభిమాన నేతకు కడసారి నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments