Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (14:20 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకు తరలించారు. ఆయన వెంట ముగ్గురు వైద్యుల బృందం కూడా వెళ్లింది. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
నానికి రక్తనాళాల్లో మూడు బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించి, ఓ హెల్త్ బులిటెన్‌ను కూడా రిలీజ్ చేశారు. పైగా, ఆయనకు క్రిటికల్ సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తరలించాలని కుటుంంబ సభ్యులు నిర్ణయించారు. 
 
ఈ క్రమంలో ఏ ఒక్క నిమిషాన్ని వృధా చేయకుండా ఉండేందుకు వీలుగా హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్‌లో ఏఐజీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు కూడా బయలుదేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, వైకాపా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments