Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా... టీడీపీవైపు చూపు

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (13:14 IST)
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనను గట్టిగా సమర్థించిన వారిలో ఈయన ఒకరు. విభజనకు ముందు ఈయన అరకు ఎంపీగా ఉన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిపదవి వరించింది. దీంతో ఆయన రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. ఫలితంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. ఆ జాబితాలో ఇపుడు కిషోర్ చంద్రదేవ్‌ కూడా చేరిపోయారు. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఇక కష్టం అని భావిస్తున్నందువల్లే.. టీడీపీలో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నట్టు చెబుతున్నారు. 
 
కాగా, కాంగ్రెస్ తరుపున ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా చంద్రదేవ్ పనిచేశారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజనశాఖ మంత్రిగానూ పనిచేశారు. తొలినుంచి ఢిల్లీ రాజకీయాల‌పైనే చంద్రదేవ్ ఎక్కువ ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments