రెండు రూపాయల కోసం దారుణంగా చంపేశాడు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (16:44 IST)
ఇద్దరి మధ్య చిన్న తగాదా కాస్త ఒక ప్రాణాన్ని బలిగొంది. కేవలం రెండు రూపాయలకు ఘర్షణ పడి చివరకు ప్రాణం తీసుకున్నారు. కాకినాడలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకకు చెందిన సాంబమూర్తి స్థానికంగా సైకిల్ పంక్చర్ షాపు నడుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సువర్ణరాజు తన స్నేహితులతో కలిసి సాంబమూర్తి సైకిల్ షాప్ వద్దకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు.
 
గాలి కొట్టించుకున్న తరువాత డబ్బులు ఇవ్వలేదు. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లిపోయాడు. దీంతో సాంబమూర్తి డబ్బులు ఇవ్వాలని సువర్ణరాజును అడిగాడు. మర్చిపోయాను.. ఇదిగో డబ్బులు అంటూ ఇవ్వబోయాడు. రెండు రూపాయలు కూడా మర్చిపోయావా అంటూ సాంబమూర్తి ఎగతాళిగా మాట్లాడాడు.
 
దీంతో సువర్ణరాజుకు కోపమొచ్చింది. సాంబమూర్తితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు సాంబమూర్తి షాపులోని ఇనుప సామాన్లు తీసుకున్న సువర్ణరాజు అతడిపై దాడికి దిగాడు. దీంతో సాంబమూర్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాకినాడ రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments