Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా - 151 మందికి అస్వస్థత

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:25 IST)
చిన్నారుల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడే కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఈ చాక్లెట్లను ఆరగించిన 151 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన బెల్జియం దేశంలోని అర్లోన్ నగరంలో జరిగింది. 
 
ఫెర్రెరో కార్పొరేట్ ప్లాంట్‌లో తయారయ్యే జాయ్ చాక్లెట్లు ఆరగించిన చిన్నారుల్లో 151 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ చాక్లెట్లను ఆరగించిన చిన్నారులు అతిసారం, వాంతులతో బాధపడుతుండటాన్ని వారి తల్లిదండ్రులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ నివేదిక ప్రకారం 2021 డిసెంబరులో చాక్లెట్ల తయారీ పదార్థాలలో సాల్మొనెల్లా టెఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. అలాంటి పదార్థాలతో తయారైన కిండర్ చాక్లెట్లను తినడం వల్ల చిన్నారులు అస్వస్థతకు లోనవుతున్నట్టు పేర్కొంది. సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనదిగా యూఎస్ ఆహార సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments