Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో బాలుడు అపహరణ - జగ్గయ్యపేటలో గుర్తింపు!

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (10:20 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అపహరణకుగురైన బాలుడి ఆచూకీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో గుర్తించారు. ఈ బాలుడు గత యేడాది ఫిబ్రవరిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఆ బాలుడి ఆచూకీ యేడాదికి లభించింది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. 
 
విజయవాడ చెందిన ఓ మహిళ ముంబైలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి దేచుపాలెయంలోని తమ బంధువైన మహిళకు రూ.2 లక్షలకు విక్రయించింది. అయితే, ఈ బాలుడు జగ్గయ్యపేటలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఆ స్కూల్ వార్షికోత్సవం జరిగింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ బాలుడిని గుర్తించి రక్షించారు. బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న తల్లిదండ్రులకు చూపించి ఆ బాలుడిని తమతో తీసుకెళ్లిపోయారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, బాలుడిని కిడ్నాప్ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడిని శ్రావణి అనే మహిళ కిడ్నాప్ చేసి విక్రయించినట్టు వెల్లడించడమే కాకుండా, బాలుడి ఆచూకీని కూడా తెలిపిందని చెప్పారు. మరోవైపు, గత యేడాదికాలంగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments