Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీలో కీలక నిర్ణయం, ఏంటది?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (21:59 IST)
తిరుమల శ్రీవారి నిధులతో నడుపబడుతున్న ఛానల్ ఎస్వీబీసీ. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలే. గతంలో ఈ ఛానల్లో ప్రైవేటు యాడ్స్ ఎక్కువగా కనిపించడంతో భక్తులు భక్తి ఛానల్లో కూడా ఇలాంటివి ఏంటంటూ ప్రశ్నించారు.
 
ముఖ్యంగా డయల్ యువర్ ఈఓ లాంటి కార్యక్రమాల్లోనే భక్తులు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛానల్ ఎమ్‌డి ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీని ప్రకటించారు.
 
ఇకపై యాడ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ఆధ్యాత్మిక యాడ్స్ మాత్రమే ఉంటాయి. డబ్బులు తీసుకోరు. ఆదాయ వనరుల కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్వీబీసీ ఎమ్‌డి ధర్మారెడ్డి తెలిపారు. ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛంధంగా విరాళాలు అందిస్తే మాత్రం స్వీకరిస్తామన్నారు ధర్మారెడ్డి.
 
ఇప్పటికే ఎస్వీబీసీ ఛానల్‌కు 25 లక్షల రూపాయలను విరాళంగా భక్తులు అందజేశారు. స్వామివారి పేరు మీద నడుపబడుతున్న ఛానల్‌కు భక్తులందరూ విరివిగా విరాళాలు ఇవ్వొచ్చునని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments