Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేటర్ పదవికి.. టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని శ్వేత

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (14:06 IST)
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్‌కు వెళ్లి అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 
 
అంతకుముందు ఆమె విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూబ, వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తన నిర్ణయాన్ని ముందుగా ఎమ్మెల్యేకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. పైగా, గద్దె రామ్మోహన్ రావు తమ కుటుంబ స్నేహితుడని తెలిపారు. 
 
అక్కడ నుంచి ఆమె నేరుగా విజయవాడ కార్పొరేషన్ కార్యాలయాని చేరుకుని తన రాజీనామా లేఖన ు మేయరకు అందజేశారు. కాగా, తన కుమార్తె రాజీనామా చేయనున్నారనే విషయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ముందుగానే ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెల్సిందే. అలాగే, తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments