Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కేసీఆర్,జగన్ భేటీ - రాజధాని విషయంలో జగన్‌కు కేసీఆర్ సలహా ఇస్తారా?

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (11:28 IST)
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం భేటీ కానున్నారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల వ్యవధిలోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలపై చర్చ జరిగే అవకాశం వుంది.

గతంలో జరిగిన సమావేశాల్లో.. అధికారులు, మంత్రులు పాల్గొంటే... ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2020, జనవరి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఈ సమావేశం జరుగబోతోంది.  
 
మూడున్నర నెలల తర్వాత ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు. కేసీఆర్‌, జగన్‌ సమావేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. సీఏఏకు వైసీపీ మద్దతు తెలిపినా... ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేంద్రం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకించాలంటూ ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. 
 
ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే గతంలో చర్చించిన నదుల అనుసంధానంతో పాటు ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే గోదావరి నంది నుంచి ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న జలాలను ఒడిసి పట్టుకోవాలని ఇరు ప్రభుత్వాలు భావించాయి. 
 
అందులో భాగంగా తెలంగాణలో ఒక రిజర్వాయిర్ ను నిర్మించాలని ఆలోచన చేశారు. అయితే ఈ ఆలోచనను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరమించుకున్నారు. తెలంగాణ తో సంబంధం లేకుండానే గోదావరి , కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. గోదావరి జలాలపై కూడా ఈసారి చర్చ జరిగే ఛాన్లున్నట్లు తెలుస్తోంది. ఇంకా రాజధాని వ్యవహారంపై కేసీఆర్.. ఏపీ సీఎం జగన్‌కు మంచి సూచన ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments