Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:17 IST)
నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా అనేకమంది డెలిగేట్స్ ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అమరావతికి చేరుకున్నారు.
 
అలాగే టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధులు కూడా ఈ సదస్సు కు రానున్నారు. శుక్రవారం కవిత అమరావతికి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. అమరావతి పర్యటన సందర్భంగా కవిత విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. ఈ సదస్సులో ఏపీకి చెందిన మంత్రులతో పాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సదస్సులో పాల్గొంటారు. 
 
కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, నాలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. శ్రీలంక ప్రథమ మహిళ మైత్రేయి విక్రమసింఘె, అమెరికా చట్ట సభ ప్రతినిధి అరుణ్‌మిల్లర్‌, కెన్యా నుంచి నలుగురి రాక ఖరారైందని సమాచారం. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొంటారు. దీంతో కవిత.. బ్రాహ్మణితో కలిసి వేదిక పంచుకుంటారా అనేది తెలియాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments