Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముడుపై వ్యాఖ్యలు.. 'కత్తి'ని బెంగళూరుకు తరలించారు... రెండు రాష్ట్రాల్లో తిరగనివ్వరా?

కత్తి మహేష్ ఓ పట్టాన వదిలిపెట్టేట్లు లేరు. ఇటీవలే శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో హిందూ ధార్మిక సంఘాలన్నీ ఆయనపై మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కత్తి మహేష్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (11:41 IST)
కత్తి మహేష్ ఓ పట్టాన వదిలిపెట్టేట్లు లేరు. ఇటీవలే శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో హిందూ ధార్మిక సంఘాలన్నీ ఆయనపై మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కత్తి మహేష్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించి ఏపీకి తరలించారు. ఇక్కడ కూడా కత్తి మహేష్ కుదురుగా వుండటం లేదని చెపుతున్నారు. 
 
వదిలినచోట వుండకుండా తన సొంతూరు యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్‌ తెలియజేశారు. కత్తి మహేష్ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. అక్కడికి వెళితే హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశం వున్నదనీ, వెళ్లేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఐతే కత్తి మహేష్ మాత్రం తను వెళ్లి తీరాలంటూ పట్టుబట్టడంతో ఆయనను బలవంతంగా జీపు ఎక్కించుకుని బెంగళూరుకు తరలించారు. 
 
మరోవైపు కత్తి మహేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వుండకూడదనీ, ఆయనను తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్లు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి కత్తి వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments