Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి : వైకాపా ఎమ్మెల్యే కారుమూరి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:08 IST)
సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపాకు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి అంటూ మండిపడ్డారు. పైగా, ఆయన్ను అసలు తాను మనిషిగా కూడా చూడనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 
ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జగన్‌కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. అలాగే, తణుకు వైకాపా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వర రావు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. రఘురామకృష్ణంరాజు ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments