Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ ద

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (20:33 IST)
కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుతో యువతిపై వారు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కనిగిరిలోని ఓ ప్రైవేటు కాలేజీలో సదరు యువతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో కార్తీక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీనిపై ఆగ్రహం చెందిన కార్తీక్ తన స్నేహితులు అనీల్, సాయిలను తీసుకుని యువతిని మంచిగా మాట్లాడుతూనే ఈ విషయంపై మాట్లాడదాం అంటూ కనిగిరి శివారు ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కార్తీక్ తనను ప్రేమించాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. అంతే... ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. 
 
ముగ్గురినీ ఎంత బ్రతిమాలాడినా రాక్షసుల్లా ఆమెపై అఘాయిత్యం చేయబోయారు. పైగా ఆ సన్నివేశాలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయాన్ని తల్లిదండ్రుల వద్ద చెప్పేందుకు యువతి భయపడింది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. టవీ9 వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments