Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి మందికి తెలుగు నేర్పే య‌త్నంలో కంచిస్వామి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:40 IST)
దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్పడానికి ఒక అంతర్జాతీయ సంస్ద అవసరమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంధ్ర సరస్వతి స్వామి సూచించారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ కంచిలో స్వామీజిని కలసి తెలుగు భాషా సంస్కృతుల వికాసంపై చర్చించారు.

తమిళనాడులో ఉన్న కోటి మంది పైగా ఉన్న తెలుగు వారికి సులభ తెలుగు పేరిట తెలుగు నేర్పే కార్యక్రమం చేపట్టి, తెలుగు ప్రాంతాలతో సంబంధ, బాంధవ్యాలు కలిపే ప్రయత్నం చేస్తున్నామని కంచి స్వామీజీ తెలిపారు. తిరువాయూరులో త్యాగరాజు ఆరాధనోత్సవాలు వలె తాళ్లపాకలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహించే యోచన చేస్తున్నామని స్వామి వారు తెలిపారు.

భుక్తి కోసం పరాయి భాషలు నేర్చుకోవచ్చు, వ్యక్తిత్వాన్ని సంతరింప చేసేది మాత్రం మాత్రృభాషన్న విషయం మరువకూడదని అన్నారు. బుద్ద ప్రసాద్ తాము ఇటీవల ఖండకావ్య పోటీలు నిర్వహిస్తే, 125 కావ్యాలు పోటీకి వచ్చాయని తెలిపితే స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు.

కంచి పీఠం పిల్లలకు పద్యల పోటీలు నిర్వహిస్తుందని, నీతి, భక్తి శతక పద్యాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయని, పద్యం తెలుగువారి ఆస్తి అన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి మీరు చేస్తున్నసేవ గమనిస్తున్నానని బుద్దప్రసాద్ కి ఆశీస్సులు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments