Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ కోటపై పసుపు జెండా : మేయర్ రేసులో 'ఆ నలుగురు'

కాకినాడ కోటపై పసుపు జెండా ఎగిరింది. సుమారు రెండు పుష్కరాల తర్వాత (25 యేళ్లు) కాకినాడ మున్సిపాలిటీని అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:11 IST)
కాకినాడ కోటపై పసుపు జెండా ఎగిరింది. సుమారు రెండు పుష్కరాల తర్వాత (25 యేళ్లు) కాకినాడ మున్సిపాలిటీని అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో టీడీపీ విజయభేరీ మోగించింది. మిత్రపక్షమైన బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ మొత్తం 48 స్థానాలకు గాను ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకుంది. 
 
దీంతో టీడీపీ టీడీపీ విజయసారథులతో పాటు.. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేసమయంలో కాకినాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సరిపడే స్థానాలు టీడీపీకి సొంతంగానే లభించాయి. దీంతో, ఆ పదవి ఎవరు కైవసం చేసుకుంటారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి, సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
 
కాగా, మేయర్ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ టీడీపీ నాయకత్వం గతంలో ప్రకటించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మేయర్ పదవి కేటాయిస్తారా? లేదా? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments