పట్టాభికి చంద్రబాబు నుంచే ప్రాణహాని ... ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:01 IST)
టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణ హాని ఉంద‌ని, ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
    
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాట‌ను ప‌దే ప‌దే నొక్కి చెపుతూ, అవును చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి, ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలనేది చంద్రబాబు తత్వం అని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు, ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంద‌ని, అది దేనికి దారితీస్తుందో చెప్ప‌లేమ‌ని, అందుకే, ఆయ‌న జాగ్ర‌త్త అని కుటుంబ స‌భ్యుల‌కు చెపుతున్నా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద ప‌ట్టాభి వ్య‌వ‌హారం, ఆయ‌న అన్న మాట సృష్టించిన రాజ‌కీయ క‌ల‌క‌లం ఇప్ప‌ట్లో ఆగే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌టం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments