Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభికి చంద్రబాబు నుంచే ప్రాణహాని ... ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:01 IST)
టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణ హాని ఉంద‌ని, ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
    
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాట‌ను ప‌దే ప‌దే నొక్కి చెపుతూ, అవును చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి, ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలనేది చంద్రబాబు తత్వం అని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు, ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంద‌ని, అది దేనికి దారితీస్తుందో చెప్ప‌లేమ‌ని, అందుకే, ఆయ‌న జాగ్ర‌త్త అని కుటుంబ స‌భ్యుల‌కు చెపుతున్నా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద ప‌ట్టాభి వ్య‌వ‌హారం, ఆయ‌న అన్న మాట సృష్టించిన రాజ‌కీయ క‌ల‌క‌లం ఇప్ప‌ట్లో ఆగే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌టం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments