Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభికి చంద్రబాబు నుంచే ప్రాణహాని ... ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:01 IST)
టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణ హాని ఉంద‌ని, ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
    
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాట‌ను ప‌దే ప‌దే నొక్కి చెపుతూ, అవును చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి, ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలనేది చంద్రబాబు తత్వం అని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు, ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంద‌ని, అది దేనికి దారితీస్తుందో చెప్ప‌లేమ‌ని, అందుకే, ఆయ‌న జాగ్ర‌త్త అని కుటుంబ స‌భ్యుల‌కు చెపుతున్నా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద ప‌ట్టాభి వ్య‌వ‌హారం, ఆయ‌న అన్న మాట సృష్టించిన రాజ‌కీయ క‌ల‌క‌లం ఇప్ప‌ట్లో ఆగే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌టం లేదు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments