Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభికి చంద్రబాబు నుంచే ప్రాణహాని ... ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:01 IST)
టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణ హాని ఉంద‌ని, ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
    
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాట‌ను ప‌దే ప‌దే నొక్కి చెపుతూ, అవును చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి, ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలనేది చంద్రబాబు తత్వం అని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు, ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంద‌ని, అది దేనికి దారితీస్తుందో చెప్ప‌లేమ‌ని, అందుకే, ఆయ‌న జాగ్ర‌త్త అని కుటుంబ స‌భ్యుల‌కు చెపుతున్నా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద ప‌ట్టాభి వ్య‌వ‌హారం, ఆయ‌న అన్న మాట సృష్టించిన రాజ‌కీయ క‌ల‌క‌లం ఇప్ప‌ట్లో ఆగే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌టం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments