Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా కాకాణి గోవర్థన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ అవకాశం కల్పించే తొలి ఫైలుపై సంతకం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,395 కోట్లను ఖర్చు చేయనున్నారు. అలాగే, వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై కాకాణి గోవర్థన్ రెడ్డి రెండో సంతకం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. 
 
అంతేకాకుండా, రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ శాఖామంత్రిగా పని చేస్తానని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వేల కోట్లకు పైగా రైతుల భరోసా నగదు బదిలీ చేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments