Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళ హత్యకు దారితీసిన 'సరదా మాట'... ఏంటది?

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:17 IST)
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలను లేదా మహిళలను ఎవరైన పురుషుడు... నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సరదాగా అడుతుంటాడు. ఇపుడు ఇలాంటి సరదా మాటే ఓ మహిళ హత్యకు దారితీసింది. ఈ దారుణం కడప జిల్లా పులివెందులలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, పులివెందుల పట్టణానికి చెందిన నాగమ్మ అనే మహిళ లింగాల మండలం పెద్దకూడాల శివారుల్లో గొర్రెలను మేపుతోంది. అక్కడే ఆమె ఇటీవల హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించారు. హత్యకు ముందు రోజు నాగమ్మ మైనర్లతో మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకుంటావా అని సరదాగా ప్రశ్నించింది. 
 
ఆ ప్రశ్నకు కోపగించుకున్న వారు.. మరుసటి రోజు ఆమె గొర్రెలు మేపుతున్న చోటుకి వెళ్లి గొడవ పడ్డారు. ఈ గొడవలోనే ఆమెను బండరాయితో కొట్టి చంపారు. 
 
వారిద్దని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా బాలల నేరస్తుల గృహానికి తరలిస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు అందించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments