ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు... జ్యూడీషియల్ అధికారిగా నాగార్జున!

Webdunia
మంగళవారం, 18 మే 2021 (11:26 IST)
ఏపీలోని అధికార వైకాపా పార్టీ రెబెల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యుల బృదం ఆయనకు వైద్య పరీక్షలు చేయనుంది. 
 
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడీషియల్ అధికారిగా హైకోర్టు నియమించింది. కాసేపటి క్రితమే ఆర్మీ ఆసుపత్రికి నాగార్జున చేరుకున్నారు. ఈయన పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురాజుకు అన్ని పరీక్షలను నిర్వహించనున్నారు.
 
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయనున్నారు. టెస్టు రిపోర్టులను తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేయనుంది. మరోవైపు, తాము తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు రఘురాజును ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని రిమాండ్‌లో ఉన్నట్టుగా భావించాలని తెలిపింది.
 
మరోవైపు, ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు. ఇదేసమయంలో ఇది ఆర్మీ ఆసుపత్రి అయిన నేపథ్యంలో, సైనికాధికారులు మీడియాను కూడా సమీపంలోకి రానివ్వడం లేదు. ఇంకోవైపు, ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే మెడికల్ రిపోర్టులో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో అనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments