అందరితో కలిసి చర్చించాకే పొత్తులపై నిర్ణయం : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (20:16 IST)
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్ష పార్టీల జయాపజయాలను నిర్ణయించే శక్తిగా అవతరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోటీ చేసివుంటే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరోమారు బాధ్యతలు స్వీకరించివుండేవారని చాలా మంది అభిప్రాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పొత్తుల కంటే పార్టీ బలోపేతంపైనే దృష్టికేంద్రీకరించాలని ఆయన కోరారు. 
 
అలాగే, పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. తాను ఒక్కడినే సింగిల్‌గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదన్నారు. పొత్తులనేవి ప్రజస్వామ్యంగా, ఆమోదయోగ్యంగా ఉంటే అపుడు ఆలోచన చేద్దామన్నారు. పొత్తులపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments