Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు నా వంతుగా ఇది చిన్న సాయమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి, మహేష్ బాబులు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
 
కాగా, ఇటీవల ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, పంటలు దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం