Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారు?: జోగి రమేష్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (19:39 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి పొత్తులపై చర్చించేవారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. బీజేపీతో చేతులు కలుపుతూనే.. టీడీపీతో పవన్ కలుస్తున్నారని విమర్శించారు. 
 
స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామినా? అని నిలదీశారు.
 
పవన్, చంద్రబాబు మళ్లీ కలవడం ఏంటి? చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకెళ్లారన్నారు. వైఎస్‌ జగన్‌తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ప్రజలతో చేసే యుద్ధం అని తెలిపారు.
 
కోట్లాది మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లు, 66 లక్షల మంది తాతలు, వితంతువులు, వికలాంగులపై చేస్తున్న పోరాటమని జోగి వెల్లడించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
 
తండ్రి జైల్లో ఉంటే కొడుకు లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడానికి సిగ్గుపడాలి. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments