Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారు?: జోగి రమేష్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (19:39 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి పొత్తులపై చర్చించేవారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. బీజేపీతో చేతులు కలుపుతూనే.. టీడీపీతో పవన్ కలుస్తున్నారని విమర్శించారు. 
 
స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామినా? అని నిలదీశారు.
 
పవన్, చంద్రబాబు మళ్లీ కలవడం ఏంటి? చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకెళ్లారన్నారు. వైఎస్‌ జగన్‌తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ప్రజలతో చేసే యుద్ధం అని తెలిపారు.
 
కోట్లాది మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లు, 66 లక్షల మంది తాతలు, వితంతువులు, వికలాంగులపై చేస్తున్న పోరాటమని జోగి వెల్లడించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
 
తండ్రి జైల్లో ఉంటే కొడుకు లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడానికి సిగ్గుపడాలి. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments