Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో మూడు జిల్లాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు జిల్లాల్లో రిలయన్స్ జియో తన 5జీ సేవలను విస్తరించింది.  ఏపీలో విస్తరించిన జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రస్తుతానికి కేవలం చిత్తూరు, ఒంగోలు, కడప పట్టణాల్లోనే ఈ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని ఇతర గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా మరో 50 నగరాలకు, పట్టణాలకు రిలయన్స్ జియో 5జీ సేవలను విస్తరించింది. ఇదే అంశంపై రిలయన్స్ జియో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విడలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 5జీ విస్తరించామని, భారీ సంఖ్యలో నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకునిరావడం ఆనందంగా ఉందని తెలిపింది. 
 
కాగా, తాజా విస్తరణతో దేశంలోని 184 నగరాలు, పట్టణాల్లో జియో సంస్థ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, కొత్తగా 5జీ ప్రవేశపెట్టిన ప్రాంతాల్లోని జియో వినియోగదారులు తమ వెల్కమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని జియో సూచించింది. 1జీబీపీఎస్‌ను మించిన వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చని, ఇందుకోసం ఎలాంటి అదనపు రుసుు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments