జగన్ ఎంతో మారిపోయారు.. ఆయన పులిబిడ్డ.. సినీ హీరో రాజశేఖర్

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:37 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రోజా, అలీ, పోసాని వంటి సినీ స్టార్లు వుండగా, తాజాగా వైకాపాలో యాంగ్రీ స్టార్ హీరో రాజశేఖర్ చేరారు. సోమవారం ఉదయం తన సతీమణి జీవితతో కలిసి లోటస్ పాండ్‌కు వచ్చి, జగన్‌తో చర్చించి, వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
జగన్‌ను కలుద్దామని వచ్చామని.. ముందు చూసిన జగన్ వేరు ఇప్పుడున్న జగన్ వేరని రాజశేఖర్ అన్నారు. గతంలో కొన్ని పార్టీలతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని, వాటన్నింటినీ తొలగించుకుంటూ వచ్చానని రాజశేఖర్ చెప్పారు. ఎన్నికలకు ముందే తనకు గతంలో జగన్‌తో ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగించుకోవాలని భావించామన్నారు. 
 
అందుకే ఆయన్ని కలిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నామని చెప్పారు. ఏపీకి చంద్రబాబు నాయుడు సూపర్ సీఎం అనుకుంటే, ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారని, అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం తనకుందని అన్నారు. 
 
ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని రాజశేఖర్ కొనియాడారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని చెప్పారు. జగన్ తమపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారని ప్రశంసలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments