Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారు... లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (18:37 IST)
ఏపీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉండటంతో, ఆయన పార్టీని వీడుతున్నట్టు కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
తాజాగా ఆయన తన సన్నిహితుడు గంపల గిరిధర్‌తో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ... తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
అలాగే జనసేన నుంచి వీడనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత లక్ష్మీనారాయణ స్పందించారు. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వార్తలను అంగీకరించేవారు ఇడియట్స్ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావించినన్ని రోజులు తాను పార్టీలోనే ఉంటానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని, సమయాన్ని వృధా చేసుకోనని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments