Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం : జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:34 IST)
త్వరలోనే బీజేపీ పార్టీలో తమ పార్టీ విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని, బిజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. 
 
ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. 
 
ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్‌కు బిజెపి నుంచి ఆహ్వానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments