మొత్తం మీరే చేశారు.. మీ వల్లే నష్టం జరిగింది.. జేసీపై యనమల ఫైర్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (13:01 IST)
ఏపీ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా, అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తారసపడ్డారు. అపుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా యనమలతో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికేనా రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ ప్రశ్నించారు. దీనికి యనమల ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
"మొత్తం మీరే చేశారు. మీ వల్లే నష్టం జరిగింది" అని ఒకింత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. వీరిద్దరి సంభాషణను దగ్గరుండి చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, వీరి వైఖరిపై కొత్త చర్చకు తెరలేపారు. 
 
ఇదిలావుండగా, గత రెండు రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపా లేదా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యనమల తాజాగా చేసిన వ్యాఖ్యలతో జేసీ దివాకర్ రెడ్డి నొచ్చుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments