Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొత్తం మీరే చేశారు.. మీ వల్లే నష్టం జరిగింది.. జేసీపై యనమల ఫైర్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (13:01 IST)
ఏపీ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా, అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తారసపడ్డారు. అపుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా యనమలతో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికేనా రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ ప్రశ్నించారు. దీనికి యనమల ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
"మొత్తం మీరే చేశారు. మీ వల్లే నష్టం జరిగింది" అని ఒకింత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. వీరిద్దరి సంభాషణను దగ్గరుండి చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, వీరి వైఖరిపై కొత్త చర్చకు తెరలేపారు. 
 
ఇదిలావుండగా, గత రెండు రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపా లేదా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యనమల తాజాగా చేసిన వ్యాఖ్యలతో జేసీ దివాకర్ రెడ్డి నొచ్చుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments