Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ లడ్డూ కావాలా నాయనా..లడ్డూ.. జె.సి. సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:08 IST)
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబునాయుడు పైనే విమర్శలు చేసి చివరకు వెనక్కి తగ్గిన జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎపిలో కుల పిచ్చి తారాస్థాయిలో ఉందని, కుల పిచ్చి తగ్గితేనే రాజకీయాలు బాగుపడుతాయన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలామందికి కులపిచ్చి ఎక్కువగా ఉందని, దానివల్లే రాజకీయాలు మలినమైపోతున్నాయని చెప్పారు. అది జగన్ పార్టీయా, మా పార్టీయా.. వేరే పార్టీయా అన్నది ముఖ్యం కాదు. అందరిలోను ఈ పిచ్చి కనబడుతోంది. ఈ పిచ్చి పోవాలి. అంతేకాదు జగన్ పగటి కలలు కంటున్నాడు. 
 
నేను టివిలో ఒక యాడ్ చూశాను. బాబూ... లడ్డూ కావాలా నాయనా లడ్డూ. అలా తయారైంది జగన్ పరిస్థితి. అధికారం కోసం జగన్ పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటికైనా పగటికలలు మానుకో అని అన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments