Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీనా మజాకా.. ఈసారి జగన్‌ను పొగిడారు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (13:03 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చర్చకు తెరదీస్తుంటారు అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జె.సి.ఎప్పుడు ఏదీ మాట్లాడిన అది సంచనలమే. టిడిపిలో ఉండి ఆ పార్టీ నేతలను తిట్టడం ఆయనకు అలవాటు. అంతేకాదు ఎవరినైనా కడిగిపారేయడం జె.సి.కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఎపి రాజధాని వ్యవహారంపై ఇప్పటికే చాలాసార్లు స్పందించారు జె.సి. అయితే ఆయన స్పందించిన తీరు ఒక్కోసారి ఒక్కోరకంగా ఉండేది. 
 
తాజాగా మూడు రాజధానుల ప్రకటనపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే శాసనసభ తీర్పును అందరు గౌరవించాల్సిందేనని అన్నారు.
 
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అంతసులభతరం కాదన్న జెసి.. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటరియేట్  అన్నారు. బ్రెయిన్‌ను తీసుకువెళ్లి జగన్ విశాఖపట్నంలో పెడుతున్నారని జేసీ అన్నారు. దేశంలో కేంద్రం కోర్టులు ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments