జేసీనా మజాకా.. ఈసారి జగన్‌ను పొగిడారు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (13:03 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చర్చకు తెరదీస్తుంటారు అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జె.సి.ఎప్పుడు ఏదీ మాట్లాడిన అది సంచనలమే. టిడిపిలో ఉండి ఆ పార్టీ నేతలను తిట్టడం ఆయనకు అలవాటు. అంతేకాదు ఎవరినైనా కడిగిపారేయడం జె.సి.కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఎపి రాజధాని వ్యవహారంపై ఇప్పటికే చాలాసార్లు స్పందించారు జె.సి. అయితే ఆయన స్పందించిన తీరు ఒక్కోసారి ఒక్కోరకంగా ఉండేది. 
 
తాజాగా మూడు రాజధానుల ప్రకటనపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే శాసనసభ తీర్పును అందరు గౌరవించాల్సిందేనని అన్నారు.
 
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అంతసులభతరం కాదన్న జెసి.. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటరియేట్  అన్నారు. బ్రెయిన్‌ను తీసుకువెళ్లి జగన్ విశాఖపట్నంలో పెడుతున్నారని జేసీ అన్నారు. దేశంలో కేంద్రం కోర్టులు ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments