Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావాలంటే కడప లేదా పులివెందులలో పెట్టుకో.. చంద్రబాబు ఓ పిచ్చిపని చేశారు...

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (15:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. రాజధాని తరలింపు అంత సులభమైన పనికాదన్నారు. పైగా, రాజధానిని విశాఖపట్టణం తరలిస్తే రాయలసీమ వాసులకు చాలా దూరం అవుతుందని, ఆర్థికంగా కూడా భారం పడుతుందన్నారు. అందువల్ల రాజధాని తరలింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిని కావాలంటే కడప లేదా పులివెందులలో పెట్టుకోవాలని జగన్‌ను కోరారు. కాదని రాజధానిని వైజాగ్ తరలిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. 
 
రాయలసీమకు రాజధాని కాకుండా, హైకోర్టు వస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. మహా అయితే, పది జిరాక్స్ షాపులు వస్తాయన్నారు. అందువల్ల నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని చెప్పుకొచ్చారు. అదేసమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ పిచ్చిపని చేశారంటూ మండిపడ్డారు. రాజధాని తాత్కాలికం.. తాత్కాలికం అంటూ ప్రచారం చేశారనీ, అదే ఇపుడు కొంపముంచిందన్నారు. 
 
నిజానికి ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ప్రస్తుతం నిర్మించిన భవనాలను తాత్కాలికమని చెప్పుకొచ్చారన్నారు. అదేసమయంలో ఈ తాత్కాలిక భవనాల్లో రూపాయి ఖర్చు లేకుండా మరో పదేళ్ళపాటు పరిపాలన చేయొచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments