Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వాడు చాలా సీరియస్‌గానే ఉన్నాడు.. హైకోర్టునే పీకిపారేశాడు... జేసీ కామెంట్స్

Webdunia
గురువారం, 21 మే 2020 (15:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో మా వాడు చాలా సీరియస్‌గానే ఉన్నట్టు కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అదేసమయంలో కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా మావాడు లెక్కచేయడు. పైగా హైకోర్టునే పీకి పారేశాడు అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశం జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. వాళ్లదే రాజ్యమంటూ ఆరోపించారు. వాళ్లు చెప్పిందే చేయాల్సిందే అని డీఎస్పీ కింది స్థాయి అధికారులు హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇకపోతే, ప్రభుత్వం జారీ చేస్తున్న అడ్డగోలు జీవోలపై కోర్టులు వేస్తున్న అంక్షింతలపై జేసీ స్పందించారు. 'కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు లెక్కచేయడం లేదు. హైకోర్టునే పీకి పారేశాడు. ఆయనకు అందరు గజగజ వణుకుతారు. 
 
అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండకు ఎందుకు చస్తున్నారు. మీ సమస్య ఏంటి..? అని కూడా అడగడం లేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. వైఎస్ తప్పు చేస్తున్నాడు. అసలు మా వాళ్లు (టీడీపీ నేతలు) ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
ఒకరో ఇద్దరో దీక్ష చేస్తే జగన్‌లో మార్పు రాదు. ఉవ్వెత్తున ఆయన ఇంటి ముందు కూర్చోవాలి. నిరాహార దీక్ష నిజంగా చేసినా ప్రజలు నమ్మరు. బిర్యానీ తిని చేస్తున్నారనుకుంటారు. కొడితే 32 పండ్లు రాలేలా కొట్టాలి. లేదంటే దాని జోలికి పోకూడదు. జిందాబాద్... ముర్దాబాద్‌లకు జగన్ మాట వినడు. రాష్ట్రంలో సగం జనాభా ఆయన ఇంటి ముందు కూర్చుంటే వింటాడేమో..?. 
 
ఇకపోతే, నీళ్ల విషయంలో అన్నదమ్ములు అయినా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు. ఒకరి తల ఒకరు నరుకేందుకు వెనకాడరు. పోతిరెడ్డి పాడు విషయంలో మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడు అనిపిస్తోంది అంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొంతసేవు తిడుతూ, మరికొంతసేవు మావాడు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments