Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 మే 2020 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి రెండు మూడు రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, గురువారం ఒక్కసారిగా ఈ కేసులు పెరిగాయి. బుధవారం 9 గంటల నుంచి గురువారం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం 2,452కి చేరుకుంది. గురువారంఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు 54మంది మృతి చెందారు. కరోనాతో మరణించిన వ్యక్తిని నెల్లూరు వాసిగా గుర్తించారు. కాగా, ప్రస్తుతం ఏపీలో మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 718. గత 24 గంటలుగా 8,092 శాంపిల్స్‌ను పరీక్షించగా 45 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. 
 
ఇదిలావుంటే, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 153 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు 101 మంది ఉండగా, గుజరాత్ నుంచి 26, కర్నాటక్ 1, వెస్ట్ బెంగాల్ 1, రాజస్థాన్ 11, తమిళనాడు 3 చొప్పున ఉన్నాయి. ఇందులో 128 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments