Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌ర్ స్టార్ ఇక ప్ర‌త్య‌క్ష‌పోరాటాల‌కు... నెల‌ఖ‌రులో చ‌ర్చ‌!

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:40 IST)
రాష్ట్రంలో దాష్టీక పాలన జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వర్చువల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు అని అన్నారు. వైసిపి అరాచకాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధం అవుతుందని వెల్లడించారు. 
 
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో జనసేన బలంగా పొరాడిందని, తద్వారా 25.2% ఓట్లు సాధించాం అని పేర్కొన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే, అధికార యంత్రాంగం చోద్యం చూసింది అని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
 
 దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నార‌ని ప‌వ‌న్ విమర్శించారు. వైసిపి దాష్టిక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి దాడులను ఎలా ఎదుర్కోవాలి? క్షేత్ర స్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో తమ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments