Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నుంచి వారాహి యాత్ర.. విశాఖలో రచ్చ చేయనున్న పవన్

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (20:26 IST)
తనకు నానా అడ్డంకులు సృష్టించిన విశాఖపట్టణంలోని వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. తాను చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా, మూడో దశ యాత్ర ఈ నెల 10వ తేదీన ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం వెల్లడించారు. 

వారాహి యాత్ర ఏర్పాట్లపై విశాఖ జిల్లా నాయకులతో ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్రను మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు. 
 
నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. విశాఖలో భూకబ్జాలు, పర్యావరణం ధ్వంసమైన ప్రాంతాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వివిధ వర్గాల ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వివరించారు. ఈనెల 19 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments