Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నుంచి వారాహి యాత్ర.. విశాఖలో రచ్చ చేయనున్న పవన్

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (20:26 IST)
తనకు నానా అడ్డంకులు సృష్టించిన విశాఖపట్టణంలోని వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. తాను చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా, మూడో దశ యాత్ర ఈ నెల 10వ తేదీన ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం వెల్లడించారు. 

వారాహి యాత్ర ఏర్పాట్లపై విశాఖ జిల్లా నాయకులతో ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్రను మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు. 
 
నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. విశాఖలో భూకబ్జాలు, పర్యావరణం ధ్వంసమైన ప్రాంతాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వివిధ వర్గాల ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వివరించారు. ఈనెల 19 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments