Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018లో నేను పోరాట య‌త్ర చేసిన‌పుడే గంజాయిపై ఫిర్యాదులొచ్చాయ్!

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (11:00 IST)
ఒక ప‌క్క తెలుగుదేశం నేత‌లు గంజాయి స‌మ‌స్య‌ను హైలైట్ చేస్తూ, వైసీపీ ప్ర‌భుత్వంపైకి వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ ఎదురుదాడి చేస్తుండ‌గా, ఇపుడు దానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడ‌య్యారు. గంజాయి పై మీడియా స‌మావేశం పెట్టి, అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి పై తీవ్ర నిర్భంధం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో ఏపీలో రాజకీయ దుమారం చెల‌రేగింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీ నేత‌లు పోటీ పోటీ దీక్ష‌లు చేశారు. ఇపుడు అదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.
 
 
 ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని, ఈ ప్రభావం దేశమంతటా పడుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను 2018లో ఆయన చేసిన పోరాట యాత్రలో చాలా ఫిర్యాదులు చ్చాయని వెల్లడించారు. ఏవోబీలో గంజాయి మాఫియాపైనా ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌పైనా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్‌కల్యాణ్‌ తన ట్విటర్‌లో ఖాతాలో పొందుపరుస్తూ ట్వీట్‌ చేశారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి రెండున్న ఏళ్ళు కాలేదు. అంత‌కు ముందు ఉన్న‌ది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్న విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు లేదు. 2018లోనే గంజాయి స‌మ‌స్య ఉంద‌ని చెప్ప‌డం ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments