Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ: పంచుమర్తి అనురాధ

Advertiesment
panchumarthi anuradha
విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (15:27 IST)
వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. నారా చంద్ర‌బాబు నాయుడు దీక్ష శిబిరంలో ఆమె ప్ర‌సంగిస్తూ, వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ప్రజలంటున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చార‌ని అన్నారు. 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబ‌ని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత చంద్రన్న అని అనూరాధ కొనియాడారు. లోటు బడ్జెల్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని అంటూ, తడి గుడ్డలతో గొంతు కోయడం సజ్జల రామ‌కృష్ణా రెడ్డికి బాగా తెలుసు అని విమ‌ర్శించారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశార‌ని, రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో ఏపీ సీఎం జ‌గ‌న్ సమాధానం చెప్పాల‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావాడు అధికారంలోకి రాకపోతే... ప్రతిరోజూ అబద్దాలే వార్తలు,డిబేట్లు!