Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత ద్రోహి జగన్ - విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు!

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (09:01 IST)
దళిత ద్రోహి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఆరోపించింది. విగ్రహాన్ని చూసి మోసపోవద్దని, జరిగిన దారుణాలు మర్చిపోవద్దని రాష్ట్రంలోని దళిత ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదే విషయంపై ఆ పార్టీ ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు, నేరాలు ఘోరాలతో ఓ జాబితాను రిలీజ్ చేసింది. "దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని, 5 ఏళ్ళ జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని ఆరోపించింది. 
 
నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్గాలు తీసే జగన్‌కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని నిలదీశింది. ఎన్నికల వరుకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాలు ఏర్పాటా అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది? సమాజంలో దళితులపై వివక్ష పోవాలనుకున్నాడు. కానీ కంసమామ జగన్ దళితులని హత్యలు చేసినవారిని చేరదీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే, విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు అంటూ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments