Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో సీఎం జగన్ - పవన్ కళ్యాణ్ రాకతో సందడే సందడి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (08:44 IST)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయనడు, తన మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి హాజరయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్.. తన మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకుని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. 
 
ఇక త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్న రాజారెడ్డి ప్రియలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు వచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.
 
అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై త్వరలో ఒక్కటి కాబోతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత షర్మిల, బ్రదర్ అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి ఫోటోలు దిగారు. కాగా, పవన్ రాకతో గోల్కొండ రిసార్ట్స్‌లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments