Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నుంచి జనసేన ఉత్తరాంధ్ర సమావేశాలు

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:34 IST)
జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు మార్చి రెండో తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖపట్నంలో జరగనున్నాయి.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాల్లో పాల్గొని పార్టీకి సంబంధించిన వివిధ అంశాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పార్టీ నేతలతో చర్చిస్తారు.

ఇప్పటి వరకు ప్రకటించిన కమిటీలలోని సభ్యులు, పార్టీ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, జిల్లాలోని ముఖ్యనాయకులు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
 
మార్చి 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా, మార్చి 3వ తేదీ ఉదయం 11 నుంచి 1 గంట వరకు విజయనగరం జిల్లా, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విశాఖ రూరల్ జిల్లా సమావేశాలు జరుగుతాయి.

మార్చి 4 ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం, 11 గంటల నుంచి 12 .30 వరకు విశాఖ అర్బన్ జిల్లా సమావేశం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంట్ కమిటీ సమావేశాలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments