Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా... జనసేన గాజు గ్లాసుకు భలే డిమాండ్

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:22 IST)
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసేన పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. తమ పార్టీకి ఎన్నికల గుర్తు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసి, జనసైనికులు అందరూ తమ పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలువు ఇవ్వడంతో కార్యకర్తలు అందరూ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. 
 
పార్టీ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గాజు గ్లాసులో టీ తాగే ఫోటోలు పోస్టు చేస్తూ ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోటీ చేసే అభ్యర్ధులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గ్లాసులను పెద్దఎత్తున కొనుగోలు చేసి ప్రచారం చేస్తున్నారు. 
 
సాధారణంగా గాజు గ్లాసు ధర 10 నుంచి 15 రూపాయల ధర ఉంటే ఇప్పుడు ఆ గ్లాసు ధర 50 రూపాయలు నుంచి 60 రూపాయలు వరకూ పలుకుతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గాజు గ్లాసుల వినియోగం బాగా తగ్గిపోవడం... మార్కెట్లో గ్లాసులు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ ఆసరాగా చేసుకుని రేటు పెంచేశారు మార్కెట్‌దారులు. డిస్పోజ్‌బుల్ గ్లాసులు విరివిగా వాడుతున్న నేటి రోజుల్లో జనసేన పార్టీ మూలంగా గాజు గ్లాసులకు భలే గిరాకీ వచ్చినట్టుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments