Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశానికి జనసేన పార్టీ దూరం... దూరం..

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల సంఘం కమిషనరు నీలం సాహ్ని శుక్రవారం నిర్వహించనున్న సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆయన ఆరోపించారు. అందుకు నిరనసనగా శుక్రవారం ఎస్ఈసీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. 
 
కాగా, గురువారం సాయంత్రం ఎస్ఈసీ ఆహ్వానాన్ని పంపారని, ఈలోపే పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెప్తారని పవన్ ప్రశ్నించారు. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యన్నారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో జననేస పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాకముందే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని పవన్ ఆరోపించారు. 
 
మరోవైపు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీ పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా పాల్పడిన అరాచకాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments