Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు న్యాయం చేస్తే సరేసరి.. లేకుంటే...: పవన్ వార్నింగ్

విజయవాడలోని ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి తాను రోడ్డెక్కుతా

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:27 IST)
విజయవాడలోని ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి తాను రోడ్డెక్కుతానని హెచ్చరించారు.
 
శుక్రవారం విజయవాడలో ఆయన ఫాతిమా కాలేజీ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఎదుర్కుంటున్న సమస్యల గురించి పవన్‌కు వారు ఏకరవు పెట్టారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా ఆలకించిన పవన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని.. ఫాతిమా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకుంటే... వారితో కలిసి తాను కూడా ఉద్యమిస్తానని ప్రకటించారు. 
 
కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యపై మంత్రి కామినేనితో మాట్లాడి వెంటనే న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించాలని కేంద్రాన్ని కోరడం కాదు.. అవసరమైలే.. కేంద్రాన్నే ఇక్కడికి తీసుకొద్దామన్నారు. ఫాతిమా విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపకపోతే.. అది ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments