Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా త‌యారైన నేటి పాలకులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:46 IST)
రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను నేటి పాల‌కులు నీరుగారుస్తున్నార‌ని జ‌న‌సేన నేత‌లు ఆవేదన వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని, ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . 

 
బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి  కళాక్షేత్రం వద్ద  ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్  పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ  సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.


ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు విజ‌య‌వాడ ఇన్ ఛార్జి పోతిన మ‌హేష్, ఇత‌ర నేత‌లు అంబేద్క‌ర్ కు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments