Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం కావాలంటే బీజేపీలో చేరాలి : అన్నం సతీశ్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:06 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని, ఈ లక్ష్యం నెరవేరాలంటే ఆయన బీజేపీలో చేరాలని బీజేపీ నేత అన్నం సతీశ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ వచ్చే జనవరి నెలలోగా బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. 
 
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని... ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందన్నారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్... ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 
 
మరోవైపు, నవ్యాంధ్ర అమరావతి నిర్మాణం విషయంలో వైకాపాలోని ప్రభుత్వం వెనుకడుగు వేస్తే అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్నం సతీశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments