Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం కావాలంటే బీజేపీలో చేరాలి : అన్నం సతీశ్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:06 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని, ఈ లక్ష్యం నెరవేరాలంటే ఆయన బీజేపీలో చేరాలని బీజేపీ నేత అన్నం సతీశ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ వచ్చే జనవరి నెలలోగా బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. 
 
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని... ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందన్నారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్... ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 
 
మరోవైపు, నవ్యాంధ్ర అమరావతి నిర్మాణం విషయంలో వైకాపాలోని ప్రభుత్వం వెనుకడుగు వేస్తే అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్నం సతీశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments